తొలి ఏడాదే టాప్​ బ్రాండ్ గా రియల్ మీ

తొలి ఏడాదే టాప్​ బ్రాండ్ గా రియల్ మీ

న్యూఢిల్లీ:  ఒప్పో సబ్​ బ్రాండ్‌‌గా ఇండియా మార్కెట్‌‌లో అడుగుపెట్టిన చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్​మీ, అడుగుపెట్టిన మొదటి ఏడాదే అత్యంత వేగంగా  ఎదిగిన బ్రాండ్‌‌గా నిలిచింది. ఈ ఏడాదిలో మొత్తం 1.50 కోట్ల హ్యండ్‌‌సెట్లను విక్రయించి ఇండియాలో పాపులరైన షియోమికి   గట్టి పోటీ ఇస్తోంది. వచ్చే ఏడాది రియల్​మీ అమ్మకాలు ప్రస్తుతం కన్నా రెండింతలవుతాయని కంపెనీ ఇండియా సీఈఓ మాధవ్​సేఠ్‌‌ అన్నారు.  రూ. 7000, రూ. 20,000 ఫోన్స్​సెగ్మెంట్లలో షియోమికి ఈ బ్రాండ్​గట్టి పోటీ ఇస్తోంది. వివో, ఒప్పో వంటి  బ్రాండ్లలా కాకుండా, పూర్తిగా ఈ కంపెనీ ఆన్‌‌లైన్ డిస్ట్రిబ్యూషన్‌‌పై దృష్టి సారించింది.  రియల్​ మీ మొదట ఒప్పో సబ్ బ్రాండ్‌‌గా ఇండియాలో అడుగుపెట్టినప్పటికి, తర్వాత పూర్తి ఇండిపెండెంట్​బ్రాండ్‌‌గా మారింది. ఈ కంపెనీని ఒప్పో పేరెంట్​ కంపెనీ బీబీకేతో కలిసి మాధవ్​శేఠ్‌‌ ఇండియాలోకి తీసుకొచ్చారు. రియల్​మీ 2019లో ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్మార్ట్‌‌ఫోన్​ బ్రాండ్లలో లో ఏడవ స్థానాన్ని పొందిందని మాధవ​ శేఠ్‌‌ అన్నారు. “ మనం 2019  చివరిలో ఉన్నాం. ఇది మా ఆపరేషన్స్‌‌కు మొదటి పూర్తి ఏడాది. ఈ ఏడాదిలో 1.50 కోట్ల హేండ్‌‌సెట్లను విక్రయించాం. వచ్చే ఏడాది మా అమ్మకాలను రెండింతలు చేయడమే మా టార్గెట్” అని ఆయన అన్నారు.  ఐడీసీ(ఇంటర్నేషనల్​ డేటా కార్పోరేషన్) డేటా ప్రకారం ఈ ఏడాది మూడవ క్వార్టర్‌‌‌‌లో  ఇండియాలో మా బ్రాండ్​ 14.3 శాతం వాటాను దక్కించుకుందని తెలిపారు.  మొత్తంగా ఇండియాలో రియల్​మీ నాల్గవ అతిపెద్ద స్మార్ట్‌‌ఫోన్​బ్రాండ్‌‌గా అవతరించిందని ఐడీసీ పేర్కొంది. మూడవ క్వార్టర్‌‌‌‌లో ఇండియాలో షియోమి 27.1 శాతం మార్కెట్​ వాటాతో మొదటి స్థానంలో ఉండగా,  సామ్‌‌సంగ్ 18.9 శాతంతో, వివో 15.2 శాతంతో తర్వాతి స్థానాలలో ఉన్నాయి.  షియోమి తక్కువ ధరలలో నాణ్యమైన స్మార్టఫోన్లతో తన ప్రయాణాన్ని  2015 లో  ప్రారంభించింది. ఆ మార్గాన్నే రియల్ మీ కూడా అనుసరిస్తోంది. రియల్​మీ ఇండియాలో మొదట 2018 మే లో  ప్రారంభమైంది. 2018 మూడవ క్వార్టర్‌‌‌‌లో ఈ బ్రాండ్​ మార్కెట్​ వాటా కేవలం 3.1 శాతం మాత్రమే.  ప్రస్తుతం చైనా, ఇండియా, సౌత్ ఈస్ట్​ఏసియా, రష్యా, యూరోప్​ వంటి 20 మార్కెట్లలో అందుబాటులో ఉంది.

కలిసొచ్చిన పండుగ సీజన్..

కేవలం దివాళి సిజన్‌‌లోనే  52 లక్షల స్మార్ట్‌‌ఫోన్లను విక్రయించామని మాధవ్​శేఠ్‌‌ అన్నారు.  కౌంటర్‌‌‌‌పాయింట్​రీసెర్చ్​ ప్రకారం,  రియల్​మీ 2019 మూడవ క్యార్టర్‌‌‌‌లో కోటి స్మార్ట్​ఫోన్లను రవాణా చేసింది. ఇది ఏడాది ప్రాతిపదికన 808 శాతం పెరుగుదల. ఈ పండుగ సీజన్‌‌లో రియల్​మీ సీ2, రియల్​మీ 3ఐ, రియల్​మీ 5 మోడల్స్​అత్యధికంగా అమ్ముడు పోయాయి.  ప్రస్తుతం ఈ కంపెనీ అంతర్జాతీయ స్మార్ట్‌‌ఫోన్ మార్కెట్‌‌లో ఏడవ ర్యాంక్‌‌లో ఉందని కౌంటర్​పాయింట్ పేర్కొంది.  ఆఫ్​లైన్లో  అందుబాటులో ఉండే సిరీస్‌‌లను ప్రారంభించనున్నామని షేత్​ తెలిపారు. బెటర్​బ్యాటరీ, టచ్​తో ఇవి మిడ్​ ప్రీమియం రేంజ్‌‌లో ఉంటాయని తెలిపారు. “అనేక స్మార్ట్‌‌ యాక్ససరీలతో పాటు ట్రెండీ డిజైన్, గ్రేట్​ పెర్ఫార్మెన్స్‌‌తో రియల్​మీ కస్టమర్లను పలకరించనుంది. 2020 లో టెక్​లైఫ్​స్టైల్​బ్రాండ్‌‌గా రియల్​మీ నిలవనుంది”అని శేఠ్‌‌​ తెలిపారు.  సీ సిరీస్, నంబర్​సిరీస్, ప్రో సిరీస్​, ఎక్స్​సిరీస్​లతో ఇండియాలో రియల్​మీ పాపులర్​ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్రాండ్​ ఆన్​లైన్‌‌ మార్కెట్లో విస్తరించింది. ఫ్లిప్‌‌కార్ట్‌‌లో నెంబర్​ వన్ బ్రాండ్‌‌గా రియల్​ మీ నిలవగా, మొత్తం మీద నెంబర్​2 పొజిషన్‌‌లో ఉంది. ప్రస్తుతం  ఈ కంపెనీ ఆఫ్​లైన్​మార్కెట్లోకి విస్తరించడానికి ప్రణాళికలు వేస్తోంది.  70 శాతం అమ్మకాలు ఆన్​లైన్​ద్వారా, 30 శాతం ఆఫ్​లైన్​ద్వారా జరపడమే టార్గెట్‌‌గా పెట్టుకుంది.  ఈ సంస్థ పేరెంట్​ కంపెనీ అయిన బీబీకే  ఎలక్ట్రానిక్స్​ వివో, ఒప్పో వంటి బ్రాండ్లను కూడా తయారు చేస్తోంది. ప్రస్తుతం రియల్​మీ ఇండిపెండెంట్ కంపెనీగా నడుస్తోంది. ఈ కంపెనీ ఫౌండర్​మాజీ ఒప్పో వైస్​చైర్మన్​ స్కైలీ. రియలీ మొబైల్ టెలికమ్యునికేషన్స్‌‌ ప్రై. ప్రస్తుతం ఇండిపెండెంట్​ బ్రాండ్‌‌గా ఉందని మాధవ్​షేత్​అన్నారు.  ఈ కంపెనీలో మెజార్టీ వాటాదారు బీబీకే.