తమిళనాడులో రూ. 4 కోట్ల ఎర్రచందనం పట్టివేత

తమిళనాడులో రూ. 4 కోట్ల ఎర్రచందనం పట్టివేత

తమిళనాడులో భారీగా ఎర్ర చందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా సెంగుండ్రం దగ్గర 4 కోట్ల రూపాయిల విలువైన ఎర్ర చందనాన్ని పట్టుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఒక లారీ మూడు రోజులుగా అక్కడ ఆగి ఉండటంతో పోలీసులు అనుమానంతో తనిఖీ చేశారు. అందులో ఉన్న 4 కోట్ల రూపాయిల విలువైన ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు.