సెల్‌‌‌‌‌‌‌‌బే షోరూమ్​లో రెడ్​మీ 12 ఫోన్లు

సెల్‌‌‌‌‌‌‌‌బే షోరూమ్​లో రెడ్​మీ 12 ఫోన్లు

హైదరాబాద్, వెలుగు: మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చెయిన్​ సెల్‌‌‌‌‌‌‌‌బేలో రెడ్​మీ 12 సిరీస్ ​ఫోన్ల అమ్మకాలు మొదలయ్యాయి. హైదరాబాద్​లోని​ గచ్చిబౌలి షోరూమ్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం రెడ్ మీ 12 5జీ  గ్రాండ్ లాంచ్​ కార్యక్రమం జరిగింది. దీనికి నటి కామ్నా జెఠ్మలాని చీఫ్​ గెస్ట్​గా వచ్చారు. లాంచ్ సందర్భంగా సెల్‌‌‌‌‌‌‌‌బే మేనేజింగ్ డైరెక్టర్ సోమ నాగరాజు హ్యాండ్‌‌‌‌‌‌‌‌సెట్  వివరాలను తెలియజేశారు. ఈ ఫోన్​ భారతదేశంలో 5జీ కనెక్టివిటీని మరింత ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. 

రెడ్ మీ 12 5జీ ఫోన్​లో 6.79 ఇంచుల డిస్​ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ బిల్డ్, ఐపీ53 రేటింగ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని సెల్‌‌‌‌‌‌‌‌బే స్ట్రాటజీ & ప్లానింగ్ డైరెక్టర్ సుహాస్ నల్లచెరు తెలిపారు.   అంతేగాక క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 4 జెన్​ 2 చిప్‌‌‌‌‌‌‌‌సెట్, 8జీబీ ర్యామ్,​  256 జీబీ స్టోరేజీ ఉంటాయి. 18వాట్ల వైర్డ్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌‌‌‌‌‌‌‌, 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ, ఆండ్రాయిడ్ ఆధారిత ఎంఐయూఐ 14 ఓఎస్​ ఉంటాయి.   4జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 10,999 కాగా,  6జీబీ + 128జీబీ వేరియంట్ ధర  రూ. 12,499. హైఎండ్​ మోడల్​ 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ. 14,999.  కొన్ని కార్డులతో కొంటే డిస్కౌంట్లు కూడా ఉన్నాయని సుహాస్​ చెప్పారు.