- రాత్రి వేళల్లో హైవేలు, ఓఆర్ఆర్పై ప్రమాదాల నివారణకు ఆర్టీఏ చర్యలు
హైదరాబాద్,వెలుగు: హైవేలు, ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి వాహనం వెనుక తప్పనిసరిగా రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఉండేలా చర్యలు ప్రారంభించింది. త్వరలోనే దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇటీవల కాలంలో జాతీయ రహదారులపై పెద్దసంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా ప్రమాద ఘటనల్లో డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు ఆయా వాహనాలకు ముందస్తు జాగ్రత్తల విషయంలో సరైన శ్రద్ధ చూపకపోవడమే కారణమని అధికారులు చెప్తున్నారు.
ముఖ్యంగా వెహికల్స్కు వెనుక కానీ, పక్కల కానీ రిఫ్లెక్టివ్స్టిక్కర్లు అంటించకపోవడం వల్ల రాత్రి వేళల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అంటున్నారు. ఈ స్టిక్కర్లను వాహనాల వెనుక వైపు, ఇరువైపుల అంటిస్తే దూరం నుంచి వచ్చే వాహనాలకు చాలా సులభంగా ముందున్న వాహనం తెలిసి, ప్రమాదాలు తగ్గుతాయని చెప్తున్నారు. ఇందులో భాగంగా వెహికల్స్కు వెనుక వైపున రిఫ్టెక్టివ్స్టిక్కర్లు తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. ప్రమాదాల నివారణకు మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో వెహికల్స్కు రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు మస్ట్గా చేశారు. దీని వల్ల రాత్రి వేళల్లో ఆయా రాష్ట్రాల్లో ప్రమాదాలు తగ్గాయని, మన రాష్ట్రంలో కూడా ఇదే విధానం అమలు చేస్తామని ఆర్టీఏ అధికారులు అంటున్నారు.