ట్రైనీ సివిల్ సర్వెంట్లతో మోడీ మీటింగ్

ట్రైనీ సివిల్ సర్వెంట్లతో మోడీ మీటింగ్

లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‎లో 96వ కామన్ ఫౌండేషన్ కోర్సు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కొత్త స్పోర్ట్స్ కాంప్లెక్స్‎ను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా హ్యాపీ వ్యాలీ కాంప్లెక్స్‎ను  దేశానికి అంకితం ఇచ్చారు. కొత్త ప్రపంచంలో మన పాత్రను పెంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. కాబోయే అధికారుల మనసులో ఆత్మ నిర్భర్ భారత్‎తో పాటు ఆధునిక భారతదేశం లక్ష్యంగా ఉండాలన్నారు. నిజమైన అనుభూతి కోసం ఫీల్డ్‎లో పనిచేయాలని ట్రైనీ అధికారులకు నరేంద్ర మోడీ సూచించారు.

https://twitter.com/narendramodi/status/1504377598167683076