మరో 60 మంది డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజ్

మరో 60 మంది డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న మరో 60 మంది కాంట్రాక్టు లెక్చరర్లును ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇటీవల రిలీజ్ చేసింది. గతంలో 270 మంది కాంట్రాక్టు లెక్చరర్లను, మరో పది మినిమమ్ టైమ్ స్కెల్ లెక్చరర్లు రెగ్యులర్ అయ్యారు. అప్పట్లో పీహెచ్​డీ, నెట్, సెట్ పూర్తయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్​లో ఆలస్యం కావడంతో, వారి క్రమబద్దీకరణ పెండింగ్​లో పడింది. తాజాగా వారిని రెగ్యులరైజ్ చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.