కమెడియన్గా ఆకట్టుకున్న అభినవ్ గోమఠం హీరోగా నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’. వైశాలి రాజ్ హీరోయిన్. తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి నిర్మించిన చిత్రం ఈనెల 23న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా టీమ్ ఆదివారం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. అభినవ్ గోమఠం మాట్లాడుతూ ‘సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎంతో ఒత్తిడి ఉండేది.
ఫైనల్గా ప్రేక్షకుల స్పందన చూసి రిలాక్స్ అయ్యా. అందరి శ్రమకు తగిన ప్రతిఫలం లభించింది’ అని చెప్పాడు. ఈ చిత్రంలో భాగమవడం ఆనందంగా ఉందని చెప్పింది వైశాలి. డైరెక్టర్ మాట్లాడుతూ ‘రోజు రోజుకు సినిమా పట్ల ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుంది. మరింత ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా’ అన్నాడు. సినిమాకొస్తున్న రెస్పాన్స్కు ఆనందంగా ఉందని నిర్మాత భవాని చెప్పారు.