‘అమిగోస్’ నుంచి రొమాంటిక్ సాంగ్‌‌ను రిలీజ్

‘అమిగోస్’ నుంచి రొమాంటిక్ సాంగ్‌‌ను రిలీజ్

కళ్యాణ్ రామ్ ట్రిపుల్‌‌ రోల్‌‌లో నటించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆషికా రంగనాథ్ హీరోయిన్.  ఫిబ్రవరి 10న  సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రమోషన్స్ లో  స్పీడ్ పెంచిన మేకర్స్.. మంగళవారం ఇందులోని రొమాంటిక్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. బాల‌‌కృష్ణ ‘ధ‌‌ర్మ క్షేత్రం’ సినిమాలో  మెలోడి సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ సాంగ్‌‌కి ఇది రీమిక్స్ సాంగ్‌‌.

ఆ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడగా, ఇప్పుడు ఆయన కొడుకు ఎస్‌‌.పి.చరణ్ పాడటం విశేషం. అప్పట్లో వేటూరి సుందర రామ్మూర్తి లిరిక్స్,   ఇళయరాజా సంగీతం అందించారు.రీమిక్స్‌ తో అదే ఫీల్‌ను కలిగిస్తూ ఇంప్రెస్ చేశాడు జిబ్రాన్. క‌‌ళ్యాణ్ రామ్‌‌, ఆషికా స్టైలిష్ లుక్స్‌‌లో  కనిపిస్తున్నారు. అలనాటి పాటను గుర్తుచేసేలా సింపుల్ స్టెప్స్‌‌తో ఆకట్టుకున్నారు.