జియో 5G ఫోన్.. అతి తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ ఏజీఎంలో ప్రకటన..?

జియో 5G ఫోన్.. అతి తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్  ఏజీఎంలో ప్రకటన..?

రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సమావేశం (ఆగస్టు 28) మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఈ మీటింగ్ లో 5G జియోఫోన్, IoT డివైజ్‌లు లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ AGMలో  సంస్థ ఆర్థిక పనితీరు, ఇతర వ్యాపార విషయాల గురించి చర్చించే అవకాశం ఉంది. 

గ్లోబల్ మార్కెట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ AGMకోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.  మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ  సమావేశంలో  జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL) వంటి మరికొన్ని డీమెర్జర్‌లను ప్రకటించవచ్చని తెలుస్తోంది.  అంతేకాకుండా భవిష్యత్తులో రిటైల్‌ను కూడా ఇందులో చేర్చవచ్చు. దీంతో పాటు  ఈ వార్షిక సమావేశంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

JIO 5G ప్రీపెయిడ్ ప్లాన్‌కు సంబంధించి ఈ మీటింగ్ సందర్భంగా కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ  ప్రకటనలు చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఇందులో  Reliance Jio దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్‌ను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.   2024 నాటికి దేశంలోని అనేక ప్రాంతాల్లో Jio 5G నెట్‌వర్క్‌ను చేరుకోవాలని భావిస్తున్నారు. దీని ప్రకారం  రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విడిపోయిన తర్వాత, రిలయన్స్ రిటైల్ ఐపిఓ, రిలయన్స్ జియో ఐపిఓలకు సంబంధించి మార్కెట్ కొంత ఖచ్చితమైన ప్రకటనను ఆశిస్తోంది. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ AGMలో ముఖేష్ అంబానీ 5G ఫోన్ లాంచ్‌ను ప్రకటించే చాన్స్ ఉంది. Jio 5G రోల్ అవుట్, Jio 5G ప్రీపెయిడ్ ప్లాన్ గురించి ముఖేష్ అంబానీ ప్రకటనలు చేయవచ్చని ఆశిస్తున్నారు. ఈ ఏడాది  జూలైలో రిలయన్స్ జియో.. జియో భారత్ పరికరాన్ని రూ. 999కి విడుదల చేసింది. 2G టెక్నాలజీని ఉపయోగించి వినియోగదారులను Jio 4G నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడం ఈ ఫోన్ లక్ష్యం. ఇప్పుడు 5G ఫోన్ను ప్రకటించవచ్చని మార్కెట్ నిపుణులు ఆశిస్తున్నారు.