న్యూఢిల్లీ: టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు రూ. 96,317 కోట్ల స్పెక్ట్రమ్ వేలానికి తమ దరఖాస్తులను సమర్పించాయి. వేలం జూన్ 6 నుంచి ప్రారంభమవుతుంది. 2022లో జరిగిన చివరి వేలంలో అదానీ గ్రూప్ సంస్థ స్పెక్ట్రమ్కోసం బిడ్వేసింది. ఈసారి మాత్రం అది పాల్గొనడం లేదు. మొబైల్ ఫోన్ సేవల కోసం ప్రభుత్వం ఎనిమిది స్పెక్ట్రమ్ బ్యాండ్లను సుమారు రూ.96,317 కోట్ల బేస్ ధరతో వేలం వేయనుంది.
800 మెగాహెర్జ్, 900 మెగాహెర్జ్, 1,800 మెగాహెర్జ్, 2,100 మెగాహెర్జ్, 2,300 మెగాహెర్జ్, 2,500 మెగాహెర్జ్, 3,300 మెగాహెర్జ్, 26 గిగాహెర్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రమ్లను అమ్మనుంది. ఈ స్పెక్ట్రమ్ను 20 సంవత్సరాలు వాడుకోవచ్చు. డబ్బును 20 సమాన వార్షిక వాయిదాలలో చెల్లించాలి.