రికార్డ్ సృష్టించిన రిలయన్స్ జియో

రికార్డ్ సృష్టించిన రిలయన్స్ జియో

న్యూఢిల్లీ: టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో సరికొత్త రికార్డు సృష్టించింది. తమ  సేవలు ప్రారంభించిన రెండున్నరేళ్లలోనే 300 మిలియన్ల కస్టమర్ల మార్క్‌ను దాటింది. ఈ మైలురాయిని మార్చి 2నే జియో అందుకుంది. ఐపీఎల్‌ సీజన్‌ సందర్భంగా టీవీల్లో ఇచ్చే వాణిజ్య ప్రకటనల్లో(యాడ్స్ లో) .. ‘సెలబ్రేటింగ్‌ 300 మిలియన్‌ యూజర్స్‌’  అని పేర్కొనడంతో ఈ విషయం స్పష్టమైంది. ఇక భారతీ ఎయిర్‌టెల్‌ ఈ మైలురాయిని 19 ఏళ్లకు అందుకుంది. 170 రోజుల్లో 100 కోట్ల టెలికాం సబ్ స్క్రైబర్స్ తో జియో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కంపెనీగా మారింది.