రెలిగేర్  చైర్‌‌‌‌‌‌పర్సన్‌‌ను..ఫ్లైట్‌‌ నుంచి దించేసిన ఎయిర్ ఇండియా!

రెలిగేర్  చైర్‌‌‌‌‌‌పర్సన్‌‌ను..ఫ్లైట్‌‌ నుంచి దించేసిన ఎయిర్ ఇండియా!

న్యూఢిల్లీ : క్రూ మెంబర్లతో  దురుసుగా ప్రవర్తించినందుకు రెలిగేర్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌ చైర్‌‌‌‌పర్సన్‌‌  రష్మీ సలుజాను  ఢిల్లీ ఎయిర్‌‌‌‌పోర్టులో ఎయిర్ ఇండియా దించేసిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. లండన్‌‌ వెళ్లాల్సిన ఏఐ 161 ఫ్లైట్ నుంచి ఆమెను ఈ నెల 5 న దించేశారని చెప్పారు.  

క్రూ మెంబర్లతో  వాదించడంతో కెప్టెన్ ఆదేశాల మేరకు  ఓ మహిళా ప్యాసింజర్‌‌‌‌ను  ఫ్లైట్ నుంచి దించేశామని ఎయిర్ ఇండియా స్పోక్స్ పర్సన్ పేర్కొన్నారు. కానీ,  ప్యాసింజర్   పేరు బయట పెట్టలేదు.  ఈ ఇష్యూపై రష్మీ సలుజా స్పందించలేదు.

కాగా, ఈ ఏడాది జనవరిలో ఏకంగా 894 మంది ప్యాసింజర్లను ఎయిర్ ఇండియా దించేసింది. రూ.98 లక్షలను కాంపెన్సేషన్ కింద ఖర్చు చేసింది.