న్యూఢిల్లీ : క్రూ మెంబర్లతో దురుసుగా ప్రవర్తించినందుకు రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ చైర్పర్సన్ రష్మీ సలుజాను ఢిల్లీ ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియా దించేసిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. లండన్ వెళ్లాల్సిన ఏఐ 161 ఫ్లైట్ నుంచి ఆమెను ఈ నెల 5 న దించేశారని చెప్పారు.
క్రూ మెంబర్లతో వాదించడంతో కెప్టెన్ ఆదేశాల మేరకు ఓ మహిళా ప్యాసింజర్ను ఫ్లైట్ నుంచి దించేశామని ఎయిర్ ఇండియా స్పోక్స్ పర్సన్ పేర్కొన్నారు. కానీ, ప్యాసింజర్ పేరు బయట పెట్టలేదు. ఈ ఇష్యూపై రష్మీ సలుజా స్పందించలేదు.
కాగా, ఈ ఏడాది జనవరిలో ఏకంగా 894 మంది ప్యాసింజర్లను ఎయిర్ ఇండియా దించేసింది. రూ.98 లక్షలను కాంపెన్సేషన్ కింద ఖర్చు చేసింది.