భాషాపరమైన అంతరాలు తొలగిస్తం..కేంద్ర సమాచార శాఖ సెక్రటరీ సంజయ్ జాజు

భాషాపరమైన అంతరాలు తొలగిస్తం..కేంద్ర సమాచార శాఖ సెక్రటరీ సంజయ్  జాజు

హైదరాబాద్, వెలుగు: భాషాపరమైన అంతరాలను తొలగిస్తామని కేంద్ర సమాచార శాఖ సెక్రటరీ సంజయ్  జాజు తెలిపారు. ఇంక్యుబేటర్లు, అంకుర సంస్థలతో టీ హబ్​లో గురువారం ఆయన సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని క్రియేటివ్ ఎకానమీని ప్రోత్సహించేందుకు సమాచార, ప్రసార శాఖ ‘వేవెక్స్  స్టార్టప్  యాక్సిలరేటర్’ వేదికను ఏర్పాటు చేసిందన్నారు. డిజిటల్  వ్యవస్థ నిర్మాణంలో కీలకమైన ‘కళాసేతు’, ‘భాషాసేతు’ పోటీలను ఈ వేదిక ద్వారా ప్రారంభించామన్నారు.  ఈ పోటీల్లో పాల్గొని దేశంలోని భాషాపరమైన, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే పరిష్కారాలను అభివృద్ధి చేయాలని ఏఐ అంకుర సంస్థలను ఆహ్వానించారు. https://wavex.wavesbazaar.com లోని వేవెక్స్  పోర్టల్  ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.