
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు విషయంలో తీవ్ర చర్చ జరుగుతోంది. 23 మంది సీనియర్ నేతలు లీడర్షిప్ మార్పును డిమాండ్ చేస్తూ అధినేత్రి సోనియాకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సదరు లెటర్ రాసిన నేతలతో సోనియా మాట్లాడరని తెలిసింది. పార్టీకి కొత్త చీఫ్ను సదరు లీడర్స్యే కనుగొనాలని సోనియా వారికి సూచించారని సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి సోనియా తప్పుకుంటున్నారని పుకార్లు వస్తున్నాయి. వీటిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి సోనియా గాంధీ రాజీనామా చేస్తున్నారనే వార్తలు అవాస్తవమని సూర్జేవాలా స్పష్టం చేశారు.