- మంత్రి వివేక్కు సామాజిక సమతా వేదిక ఆహ్వానం
గోదావరిఖని, వెలుగు: ఏప్రిల్ 1 నుంచి 14వరకు గోదావరిఖనిలో నిర్వహించ తలపెట్టిన జయంత్యుత్సవాలకు హాజరుకావాలని సామాజిక సమతా వేదిక ప్రతినిధులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూర్లోని క్యాంప్ఆఫీస్లో వేదిక ప్రతినిధులు గుమ్మడి కుమారస్వామి, పులి మోహన్, పెంచాల తిరుపతి, పర్లపల్లి రవి, చింతకింది సంపత్, తదితరులు మంత్రిని కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి 12వరకు గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అంబేద్కర్ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని, 4న కాకా వెంకటస్వామి స్మారక స్పాన్సర్షిప్తో అంబేద్కర్జీవిత చరిత్రపై గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో నాటక ప్రదర్శన చేయనున్నారని చెప్పారు. 5న జగ్జీవన్రామ్ జయంతి, 11న జ్యోతిరావ్పూలే జయంతి, 13న సమతా ర్యాలీ, 14న అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు.
