రిపబ్లిక్ డే స్పెషల్… మూడురంగుల్లో దర్శనమిచ్చిన శివుడు

రిపబ్లిక్ డే స్పెషల్… మూడురంగుల్లో దర్శనమిచ్చిన శివుడు

దేశ వ్యాప్తంగా 71వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు, నాయకులు ఈ వేడుకలలో భాగమయ్యారు. పొద్దున నుంచే పిల్లలు స్కూళ్లలో జరిగిన జెండా వందనానికి హాజరవడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. అయితే… ఈ వేడుకల మద్య… ఓ శివాలయంలోని శివుడు త్రివర్ణ వర్ణాలతో దర్శనమిచ్చాడు. ఉత్తరాఖండ్ లోని… రిశికేశ్ చంద్రేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగానికి జాతీయ రంగులైన మూడు రంగులతో అలంకరించారు పూజారులు. పానపట్టం మూడురంగులతో నిండగా.. శివలింగం అశోక చక్రాన్నిపోలి ఉన్నట్లుగా కనిపించింది.

శనివారం సాయంత్రం.. మహారాష్ట్ర పూణెలో 4వేల మంది  స్కూల్ పిల్లలు కలిసి జాతీయపతాకంగా నిల్చున్నారు. దీంతో పాటు. చత్రపతి శివాజీ మహరాజ్, రాజ్ మాతా జీజూ, తానాజీ మలుసరేల చిత్రపటాలుగా నిల్చున్నారు.