ముంబై: సప్లయ్ పరమైన షాక్స్ ఏవీ లేకుంటే దేశంలో ఇన్ఫ్లేషన్ వేగంగానే 4 శాతం కిందకి దిగొస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మెంబర్ ఆశిమా గోయెల్ చెప్పారు. దేశపు బయటి నుంచి వచ్చిన షాక్స్ను సమర్ధంగా తట్టుకుంటూ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం గ్రోత్వైపు వెళ్తున్నామని పేర్కొన్నారు. బయటి దేశాల నుంచి వచ్చిన షాక్స్ అనుకున్నంత తీవ్రంగా లేకపోవడంతో ఎకానమీ గ్రోత్ రేటు 6.5 శాతానికి చేరడం సాధ్యమేనని వెల్లడించారు. వడ్డీ రేట్ల పెంపు అనేది తాజాగా వచ్చే డేటా ఆధారంగానే జరగాలేనది నా అభిప్రాయం. ఇదే విషయాన్ని నేను ఎంపీసీ సమావేశంలోనూ చెప్పానని ఆశిమా గోయెల్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
సప్లయ్ వైపు నుంచి షాక్స్ లేకపోతే దేశంలో ఇన్ఫ్లేషన్ వేగంగానే 4 శాతం కిందకి దిగి వస్తుందని, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఎక్సెస్ డిమాండ్ లేదని ఆమె వివరించారు. అనుకున్న దానికంటే గ్రోత్ ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ఫ్లేషన్ టార్గెట్ సాధించే దిశలో మానిటరీ పాలసీ కమిటీ ఇప్పుడు ఫోకస్ పెట్టొచ్చని గోయెల్ చెప్పారు. గ్లోబల్గా ఉన్న కొన్ని పరిస్థితులు, వాతావరణపరమైన అనిశ్చితులూ....ఈ రెండూ మన దేశపు గ్రోత్, ఇన్ఫ్లేషన్పై ఎఫెక్ట్ చూపిస్తాయని పేర్కొన్నారు.