- బోయిగూడలోని ఓ అపార్టుమెంట్ వాసులకు ఇబ్బందులు
- పలుమార్లు అధికారులకు కంప్లయింట్ చేసినా పరిష్కరించలే
- ఇటీవల సీఎం రేవంత్కు లెటర్రాసిన అపార్ట్మెంట్ వాసులు
- కొత్త ప్రభుత్వమైనా శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకోలు
హైదరాబాద్, వెలుగు: సిటీకి మెట్రోరైల్ వచ్చి ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణం అందిస్తుండగా.. మరికొందరికి ఇబ్బందిగా మారింది. బోయిగూడలోని మెట్రో వై జంక్షన్ పిల్లర్ నంబర్ 1006 వద్ద ఎంఎన్కే విట్టల్ కోర్టు వ్యూ అపార్ట్మెంట్వాసులు మెట్రో రైలు శబ్దాలతో రెండేండ్లుగా సరిగ్గా నిద్రపోవట్లేదు. రోజూ రైళ్ల రాకపోకలతో వై జంక్షన్వద్ద ట్రాక్, వీల్స్కు మధ్య రాపిడితో భారీ శబ్దాలు వస్తున్నాయి. మెయింటనెన్స్, ట్రయల్స్ పేరిట మిడ్నైట్లోనూ ట్రైన్స్ నడుపుతుండగా.. ఆ శబ్దాలకు నిద్రపట్టడం లేదని అపార్టుమెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రైళ్లు జంక్షన్వద్దకు రాగానే హారన్ శబ్దాలతో నిద్రలేమి, యాంగ్జయిటీ, స్ట్రెస్, బీపీ, హార్ట్ప్రాబ్లమ్.. వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు.
బోయిగూడ వై జంక్షన్ దగ్గరలోని బాబూఖాన్టవర్(అనిష్ టవర్), ఎస్ఎంఆర్రెసిడెన్సీ, సెంట్రల్వ్యూ అపార్ట్మెంట్, ఇండిపెండెంట్హౌసెస్వాసులు మెట్రో శబ్దాలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. దీనిపై రెండేండ్లుగా అధికారులకు ఫిర్యాదు చేసినా తాత్కాలికంగా కొన్ని మరమ్మతులు చేసి వదిలేశారు. ఆరు నెలలుగా శబ్దాలు ఎక్కువయ్యాయని బాధితులు పేర్కొంటున్నారు. రెగ్యులర్ గా గ్రీజ్, లుబ్రికెంట్పెడితే సౌండ్స్తగ్గే చాన్స్ ఉంటుంది. కానీ హైదరాబాద్మెట్రో రైల్లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్), ఎల్అండ్ టీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
కేటీఆర్, తలసానికి ఫిర్యాదు చేస్తే..
గతంలో మున్సిపల్కమిషనర్కు, న్యూఢిల్లీలోని నేషనల్అడ్మినిస్ట్రేటివ్అండ్పబ్లిక్ గ్రీవెన్సెస్, నేషనల్గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్కు ఎంఎన్కే అపార్టుమెంట్ వాసులు కంప్లయింట్ చేశారు. అయినా ఫలితం లేదు. గత మున్సిపల్శాఖ మంత్రికేటీఆర్కు కూడా ఫిర్యాదు చేశారు.
ఆ సమయంలో మెట్రో అధికారులు రైల్వే ట్రాక్కు గ్రీజ్పెట్టించి తాత్కాలికంగా సౌండ్స్రాకుండా చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎప్పటిలాగే సౌండ్స్మళ్లీ మొదలయ్యాయి. మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అపార్ట్మెంట్లో ముఖాముఖి నిర్వహించి మెట్రోరైలు శబ్దాలను స్వయంగా విన్నారు. మెట్రో అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత పట్టించుకోవడం మానేశారు.
లేఖ ద్వారా సీఎం రేవంత్ కు వినతి
రెండేండ్లుగా అధికారులు, నేతలకు కంప్లయింట్ చేసి విసిగిపోయామని, ప్రస్తుతం కొత్త ప్రభుత్వమైనా తమ సమస్యకు చూపుతుందని అపార్టుమెంట్వాసులు భావిస్తున్నారు. ఈనెల 22న సీఎం రేవంత్రెడ్డికి తమ సమస్యపై లేఖ రాశారు. తమకు శాశ్వత పరిష్కారం చూపాలని అందులో కోరారు. అదేవిధంగా కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్కు కూడా లేఖలను పంపించారు.
శాశ్వత పరిష్కారం చూపాలి
అధికారులకు కంప్లయింట్ చేస్తే టెంపరరీగా ఏదో చేసి వెళ్తారు. మళ్లీ వారానికే సౌండ్స్వస్తాయి. ఆరు నెలలుగా ఎన్ని కంప్లయింట్లు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. టెంపరరీ సొల్యూషన్స్కాకుండా పర్మినెంట్గా సమస్యకు పరిష్కారం చూపాలి.
- డాక్టర్ హనుమాండ్లు, ప్రెసిడెంట్, ఎం
ఎన్కే విఠల్ సెంట్రల్ కోర్టు అపార్ట్మెంట్
రెండేండ్లుగా భరించలేకపోతున్నాం..
వై జంక్షన్కు రాగానే ట్రెయిన్ హారన్వేస్తున్నారు. కొన్ని బోగీలు వచ్చినప్పడు సౌండ్ ఎక్కువగా వస్తుంది. అధికారులకు కంప్లయింట్ చేస్తే కింది నుంచే చూసి వెళ్తారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి ఫిర్యాదు చేశాం. యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు చర్యలేం తీసుకోలేదు.
- నరసింహారావు, ఎంఎన్కే విఠల్
సెంట్రల్ కోర్టు అపార్టుమెంట్
వారంలోగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తం
ఎంఎన్కే అపార్ట్మెంట్వాసుల సమస్య మా దృష్టికి వచ్చింది. ఎల్అండ్ టీ అధికారులతో మాట్లాడాం. వారం రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపిస్తం. మళ్లీ రిపీట్అవ్వకుండా చర్యలు తీసుకుంటాం.
- బీఎన్రాజేశ్వర్, హెచ్ఎంఆర్ఎల్,
జనరల్ మేనేజర్(వర్క్స్)