బెంగాల్కు చెందిన పెర్త్ మండల్ అనే వ్యక్తి 50 మంది కూర్చుని తినేలా ట్రక్కుపై ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ఇది. ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్, దానిపైన అందమైన కుర్చీలు, టేబుల్స్ ఏర్పాటు చేసి, తక్కువ ఖర్చుకే ఫుడ్ ఇస్తూ ప్రజలను అట్రాక్ట్ చేస్తున్నాడు. కరోనా కారణంగా దుబాయ్లోని ఫైవ్ స్టార్ హోటల్లో ఉద్యోగం వదిలేసి సొంతూరికి వచ్చిన పెర్త్ మండల్.. ఈ రెస్టారెంట్ను ప్రారంభించాడు. దేశ, విదేశీ రుచులను ఈస్ట్ బుర్ద్వాన్ జిల్లా ప్రజలకు అందిస్తున్నాడు. ఈ రెస్టారెంట్ తయారీకి రూ.20 లక్షలు ఖర్చయ్యాయట!