ఐటీ హార్డ్​వేర్​ దిగుమతులపై ఆంక్షలు

ఐటీ హార్డ్​వేర్​ దిగుమతులపై ఆంక్షలు

న్యూఢిల్లీ : ల్యాప్​టాప్స్​, టాబ్లెట్స్​, ఆల్​ఇన్​వన్​ పర్సనల్​ కంప్యూటర్స్​, అల్ట్రా స్మాల్​ ఫార్మ్​ ఫ్యాక్టర్​ కంప్యూటర్స్​, సర్వర్లు వంటి హార్డ్​వేర్​ ప్రొడక్టుల దిగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు వెంటనే అమలులోకి వస్తాయని కూడా ప్రకటించింది. దీంతో దేశీయంగా ఐటీ హార్డ్​వేర్​ మాన్యుఫాక్చరింగ్​ బిజినెస్​ స్వల్పకాలంలోనే పుంజుకునే వీలుంటుందని తెలిపింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయం చాలా మంచిదని, తమకు మేలు కలుగుతుందని ఎలక్ట్రానిక్స్​ కాంట్రాక్ట్​ మాన్యుఫాక్చరర్లు ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు. అంతేకాదు, ఇండియాలోని పెద్ద కాంట్రాక్ట్​ మాన్యుఫాక్చరర్​గా పేరొందిన డిక్సన్​ టెక్నాలజీస్​ షేరు బీఎస్​ఈలో 8 శాతానికి పైగా ఎగసింది.

కన్జూమర్లకు ఇబ్బందే....

షార్ట్​టర్మ్​లో సప్లయ్​ సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదని, అలాంటప్పుడు కన్జూమర్లకు ఇబ్బందులెదురవుతాయని ఐటీ హార్డ్​వేర్​ కంపెనీలు కొన్ని చెబుతున్నాయి. దేశంలో లాప్​టాప్​ అసెంబ్లింగ్​ యూనిట్​ పెట్టి ఆర్డర్లు రాక ఎదురుచూస్తున్న ఒక కాంట్రాక్ట్​ మాన్యుఫాక్చరర్​ ఇప్పుడైనా తనకు ఆర్డర్లు దక్కుతాయని ఆశాభావంతో ఉన్నారు. ఓపెన్​ ఇంపోర్ట్​ ప్రొవిజన్స్​తో గతంలో సమస్యలు ఎదుర్కొన్నామని, ఇప్పుడు డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ ఫారిన్​ ట్రేడ్​ (డీజీఎఫ్​టీ) నోటిఫికేషన్​తో ఆ సమస్యలు సమసిపోయి, ఐటీ హార్డ్​వేర్​ ఫెసిలిటీస్​కు మంచి రోజులు వస్తాయని మరో కాంట్రాక్ట్​ మాన్యుఫాక్చరింగ్​ కంపెనీ సీనియర్​ ఆఫీసర్​ చెప్పారు. 

ఏడు బిలియన్​ డాలర్ల ఐటీ హార్డ్​వేర్ బిజినెస్​లో ​లోకల్​ మాన్యుఫాక్చరింగ్​ 60 నుంచి 70 శాతం దాకా షార్ట్​టర్మ్​లోనే ఎగిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో లోకల్​ మాన్యుఫాక్చరింగ్​ 90 శాతానికి కూడా పెరిగే ఛాన్స్​ ఉందని అన్నారు. ఇంపోర్ట్​ సబ్​స్టిట్యూషన్​తో టీవీ అసెంబ్లీలో ఏం జరిగిందో, ఇప్పుడు ఐటీ హార్డ్​వేర్​లోనూ అదే జరుగుతుందని వివరించారు.

డిక్సన్​ టెక్నాలజీస్​ షేరు జూమ్​....

ఐటీ హార్డ్​వేర్​ ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు ప్రకటించడంతో దేశంలోని కాంట్రాక్ట్​ మాన్యుఫాక్చరర్​ డిక్సన్​ టెక్నాలజీస్​ బీఎస్​ఈలో 8 శాతం ఎగసి రూ. 4,454.90 కి చేరింది. ఏసర్​ కంపెనీకి  లాప్​టాప్​లను అసెంబ్లింగ్​ చేసేందుకు  డిక్సన్​ టెక్నాలజీస్ ఇప్పటికే ఒక ఫెసిలిటీని నోయిడాలో  ఏర్పాటు చేసింది. డిక్సన్​ టెక్నాలజీస్​ ఇటీవలే ​ప్రభుత్వం రివైజ్​ చేసిన ఐటీ హార్డ్​వేర్​ పీఎల్​ఐ స్కీము కోసం అప్లయ్​ చేసుకునే ప్రయత్నంలోనూ ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ఆంక్షలతో చైనా నుంచి దిగుమతులు ప్రధానంగా తగ్గిపోతాయని అంచనా. 

లోకల్​ మాన్యుఫాక్చరింగ్​ పెంచేందుకే ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందని ఐడీసీ ఇండియా అసోసియేట్​ వైస్​ ప్రెసిడెంట్​ నవ్​కేందర్​ సింగ్​ చెప్పారు. వెండార్లు ప్రతీ క్వార్టర్లోనూ 20 లక్షల దాకా నోట్​బుక్స్​ను షిప్​ చేస్తున్నారని, ఇందులో మూడొంతులు దిగుమతి చేసుకున్నవేనని, ప్రీమియం నోట్​బుక్సయితే పూర్తిగా దిగుమతి చేసుకునేవేనని పేర్కొన్నారు. ఇప్పటికే అమ్మకాలు లేక గత రెండు, మూడు క్వార్టర్లుగా ఇబ్బందులు పడుతున్న పీసీ మార్కెట్​కు ప్రభుత ఆంక్షల నిర్ణయం కొత్త సమస్యలు 
తెచ్చి పెట్టొచ్చని అన్నారు. 

పీఎల్​ఐ డెడ్​లైన్​ పొడగింపు...

ఐటీ హార్డ్​వేర్​ కోసం పీఎల్​ఐ స్కీము గడువును రెండోసారి ప్రభుత్వం పెం చింది. డెడ్​లైన్​లోపు తగినన్ని అప్లికేషన్లు రాకపోవడంతో గడువును పెంచారు. ఆగస్టు 30 లోపు పీఎల్​ఐ స్కీము కోసం కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది.