
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంపు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు వినతిపత్రం అందజేశారు. గురువారం హైదరాబాద్లోని విశాక టవర్స్లో ఎంపీని అసోసియేషన్ ప్రెసిడెంట్ దండం రాజు రాంచందర్ రావు ఇతరులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెన్షన్ స్కీం అమలైనప్పటి నుంచి ఇప్పటివరకు రివైజ్ చేయకపోవడంతో పెన్షన్ పెరగలేదన్నారు.
అరకొర పెన్షన్తో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పెన్షన్ను పెంచేందుకు కృషి చేయాలని ఎంపీని కోరారు. ఉద్యోగుల కుటుంబాలకు మెరుగైన వైద్యం, రేషన్ కార్డుల జారీకి చొరవ చూపాలని విన్నవించారు. స్పందించిన ఎంపీ వంశీకృష్ణ ఈనెల 21 నుంచి జరిగే వర్షాకాలపు పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయాన్ని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.