ఆ బిడ్డల పేరిట చెరో రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలి

ఆ బిడ్డల పేరిట చెరో రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలి

ప్రైవేట్ టీచర్లకు, కాలేజ్ లెక్చరర్లకు నెలకు రూ.5 వేలు సాయం చేయాలన్నారు కాంగ్రెస్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వం ఇస్తానన్న రూ.2వేలు ఏమూలకు సరిపోవన్నారు.నాగార్జున సాగర్ లో ఆత్మహత్య చేసుకున్నప్రైవేట్ టీచర్ రవి కుమార్ కుటుంబాన్నిరేవంత్ పరామర్శించారు. సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన రేవంత్.. టీచర్ రవి కుమార్ దంపతుల ఆత్మహత్య హృదయాన్ని కలచి వేసిందన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం కనీస మానవత్వంతో వ్యవహరించలేదన్నారు. రవి కుమార్ దంపతుల బిడ్డల బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. ఆ బిడ్డల పేరిట సీఎం సహాయ నిధి నుంచి చెరో రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలన్నారు.