ఖమ్మం:ఓటు హక్కును తొలగించేందుకే SIR తీసుకొచ్చిందన్నారు సీఎం రేవంత్రెడ్డి. బీజేపీ ప్రజాహక్కులను కాలరాస్తోందన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఓటు హక్కును తొలగిస్తే మానవ ఉనికికే ప్రమాదమన్నారు. SIR తో భూమి లేని పేదలకు హక్కులు పోతాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి పోరాటం చేయాలన్నారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వేరు వేరు కాదు.. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటానికి కామ్రెడ్లు కూడా కారణమన్నారు. ఖమ్మం జిల్లాకు ప్రత్యేకత ఉంది..మోదీ, అమిత్ షా కలిసి వచ్చిన రెండు సర్పంచ్ స్థానాలు కూడా గెలవలేరని సవాల్ విసిరారు.
సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేసింది.. అందుకు ఎలాగైన 400 సీట్లు గెలవాలని భావించింది.. కాంగ్రెస్ తో కలిసిన ఇండియా కూటమి బీజేపీ సీట్లకు గండి కొట్టిందన్నారు. గోవాల్కర్ సిద్దాంతాన్ని అమలు చేసి భారతీయ మూల వాసులను దేశం నుంచి తరిమి వేయాలని బీజేపీ చూస్తోందన్నారు సీఎం.
పేద, కార్మిక వర్గాలకోసం కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి ఎన్నో పోరాటాల చేశారన్నారు. కార్మికులకోసం కనీస వేతన చట్టం తీసుకొచ్చిందేకాంగ్రెస్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కమ్యూనిస్టుల పోరాటంతోనే హైదరాబాద్ స్వేచ్ఛావాయువులు పీల్చిందన్నారు సీఎం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల హక్కులను కాలరాస్తోందన్నారు.ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడవాలని చూస్తోందన్నారు.
