టిఫినైనా సక్కగ పెట్టండి.. సీఎం కేసీఆర్​కు రేవంత్​ లేఖ

టిఫినైనా సక్కగ పెట్టండి..  సీఎం కేసీఆర్​కు రేవంత్​ లేఖ

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలు దారుణంగా ఉందని, దాన్ని కూడా మెరుగుపరచాలని సీఎం కేసీఆర్​ను పీసీసీ చీఫ్​ రేవంత్ ​రెడ్డి డిమాండ్​ చేశారు. స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేవని, మధ్యాహ్న భోజన కార్మికులకు సరిగ్గా బిల్లులూ చెల్లించడం లేదని ఆరోపించారు. పెరిగిన ధరలకు తగ్గట్టుగా వంట ఖర్చులను చెల్లించట్లేదన్నారు. గ్యాస్​ సిలిండర్లను ఇవ్వకపోతుండటంతో కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తున్నారని విమర్శించారు. 

ఇలా సవాలక్ష సమస్యలతో మధ్యాహ్న భోజన పథకంపై విమర్శలు వస్తున్నాయని, ఆ సమస్యలను పరిష్కరించకుండా ‘సీఎం బ్రేక్​ ఫాస్ట్’​ అంటూ హడావుడి చేస్తున్నారని ఫైర్ ​అయ్యారు. కనీసం ఈ బ్రేక్ ​ఫాస్ట్​ పథకాన్నైనా సక్రమంగా అమలు చేయాలని డిమాండ్​ చేశారు. శనివారం ఆయన సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు.

 మధ్యాహ్న భోజన పథకం సమస్యలను పరిష్కరించకుండా.. చదువుకుంటున్న పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే స్థితికి బీఆర్ఎస్ ​దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేట్లు పెంచకుండా మధ్యాహ్న భోజనానికి తోడు బ్రేక్​ఫాస్ట్​ అంటే కార్మికులకు భారం అవుతుందని, వారికి వెంటనే రేట్లు పెంచాలని డిమాండ్ ​చేశారు. కొత్త మెనూకు తగ్గట్టుగా బడ్జెట్​ పెంచాలన్నారు.