తాగుబోతులకు తండ్రి.. డ్రగ్స్ తీసుకునే వాళ్లకు కొడుకు బ్రాండ్ అంబాసిడర్

తాగుబోతులకు తండ్రి.. డ్రగ్స్ తీసుకునే వాళ్లకు కొడుకు బ్రాండ్ అంబాసిడర్

తండ్రి కేసీఆర్ తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్ అయితే..కొడుకు కేటీఆర్ డ్రగ్స్ తీసుకునే వాళ్లకు బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గజ్వేల్ అభివృద్ధి గీతారెడ్డి హయాంలో జరిగిందన్నారు. సింగరేణిలో కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం జరిగితే ఏడు రోజులైనా కేసీఆర్ అధికారులతో సమీక్ష జరపలేదని..అరెస్ట్ చేయాలని ఆదేశాలివ్వలేదని విమర్శించారు. ఏడు లక్షల సీసీ కెమెరాలున్నా.. ఏడు రోజులైనా నిందితుడిని పట్టుకోలేదన్నారు. 19 నెలల్లో సోనియమ్మ రాజ్యం వస్తుందని..పంజగుట్టలో 25 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతామన్నారు. తెలంగాణ యువత కోసం అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగ యువత కోసం కార్యాచరణను చేపడతామన్న రేవంత్... పరేడ్ గ్రౌండ్ లో ధర్మ యుద్ధం చేస్తామన్నారు.