సీఎం కేసీఆర్ పురుగుల అన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చేలగాటం ఆడుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. భోగాలు తప్ప...త్యాగాలు తెలియని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా అని ప్రశ్నించారు. పేదబిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికి అని రేవంత్ ట్వీట్ చేశారు . ఒకసారి భోజనం తినే ముందు కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన బాలికల ఆశ్రమ స్కూల్ లో శుక్రవారం మధ్యాహ్న భోజనంలో వానపాము రావడంతో వాంతులు, విరేచనాలతో 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అందులో నలుగురికి సీరియస్ గా ఉంది. కొన్ని రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా పలు గురుకులాల్లోని వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గరయ్యారు.