హైదరాబాద్: ఝార్ఖండ్ లో హేమంత్ సోరెన్ సర్కారు రీసెంట్ గా పెట్రో ధరలను తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ.25 తగ్గించింది. దీంతో మిగతా రాష్ట్ర ప్రభుత్వాల మీదా పెట్రో రేట్లు తగ్గించాలనే ఒత్తిళ్లు ఎక్కువవుతన్నాయి. ఈ నేపథ్యంలో పెట్రో ధరల తగ్గింపు అంశంపై కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలకు దిగారు.
పేద రాష్ట్రమైన ఝార్ఖండ్ లో ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు రూ.25 తగ్గించింది.
— Revanth Reddy (@revanth_anumula) December 30, 2021
మనది దేశంలోనే ధనిక రాష్ట్రం అని చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం పైసా తగ్గించేది లేదంటోంది.
ఖజానా దివాళా తీసిందా…!
లేక ప్రజలను ‘పన్ను’పోటుతో వేధించడం మీకు పైశాచిక ఆనందమా!?@TelanganaCMO @KTRTRS
పేద రాష్ట్రమైన ఝార్ఖండ్ లో ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గించినప్పుడు.. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఎందుకు తగ్గించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ పైసా తగ్గించేది లేదంటున్నారని.. ఖజానా దివాళా తీసిందా అని క్వశ్చన్ చేశారు. ప్రజలను పన్ను పోటుతో వేధించడం మీకు పైశాచక ఆనందాన్ని ఇస్తోందా అని కేసీఆర్ ను దుయ్యబట్టారు.
మరిన్ని వార్తల కోసం: