నేడు కరీంనగర్ కు రేవంత్ రెడ్డి

నేడు కరీంనగర్ కు రేవంత్ రెడ్డి

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేడు కరీంనగర్ కు వెళ్లనున్నారు. వచ్చే నెల మే 6వ తేదీన వరంగల్ లో నిర్వహించబోయే రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ సన్నాహక సమావేశంపై చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు డీసీసీ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ నాయకులతో సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షులతో పాటు ఇతర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.

మరిన్ని వార్తల కోసం..

నేతన్న బీమా పథకంపై సర్కార్ సప్పడుజేస్తలేదు

లక్నో గెలుపు.. రోహిత్‌‌‌‌సేనకు వరుసగా ఎనిమిదో ఓటమి