- ఆరు రోజుల ముందుగానే టార్గెట్ రీచ్
గోదావరిఖని, వెలుగు : కోల్ ప్రొడక్షన్లో సింగరేణిలోని ఆర్జీ 1 ఏరియా ఆరు రోజుల ముందుగానే టార్గెట్ చేరుకొని రికార్డు సాధించింది. ఈ ఏరియాకు 2023–-24 ఫైనాన్షియల్ ఇయర్కు 42,99,740 టన్నుల టార్గెట్పెట్టగా.. కార్మికులు 25న నైట్ షిప్టు వరకు 43,97,668 టన్నులతో 102 శాతం బొగ్గు ఉత్పత్తి చేశారు. ఇందులో జీడికె ఓపెన్ కాస్ట్–5 క్రియాశీలకంగా పనిచేసింది. ఈ ఓసీపీలో 30 లక్షల టన్నుల లక్ష్యం కాగా.. 25 నాటికే 34.25 లక్షల టన్నులతో 116 శాతం ఉత్పత్తి చేశారు. కాగా, 2018–-19లో 95 శాతం, 2019-–20లో 62 శాతం, 2020–-21లో 49 శాతం, 2021-–22లో 65 శాతం బొగ్గు ఉత్పత్తి చేసిన ఆర్జీ 1 ఏరియా ఈ యేడు ఇప్పటికే 102 శాతం సాధించింది.
ఈ మేరకు మంగళవారం సాయంత్రం జీఎం ఆఫీస్లో జరిగిన కార్యక్రమంలో ఆఫీసర్లు, ఉద్యోగులు, యూనియన్ లీడర్లు, సూపర్ వైజర్లు, కాంట్రాక్టు ఉద్యోగులను జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ మీటింగ్లో ఆఫీసర్లు రామ్మోహన్, రామ్మూర్తి, బాణోతు సైదులు, చిలుక శ్రీనివాస్, చంద్రశేఖర్, ఆంజనేయులు, లక్ష్మినారాయణ, ధనలక్ష్మి, శివ నారాయణ, ఆంజనేయప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.