
పండ్ల తొక్కలు, కూరగాయ ముక్కల్ని చెత్తడబ్బాలో పడేస్తారు చాలామంది. అయితే వీటితో నీళ్లని శుభ్రం చేయొచ్చు అంటోంది ఈమె. అందుకోసం వాటిని ‘గ్రీన్ ఫిల్టర్స్’గా మార్చింది. వీటి సాయంతో మంచి నీళ్లలో ఉన్న హెవీ మెటల్స్ని తొలగిస్తోంది రిష జాస్మిన్ నాథన్. ఈ ఇన్నొవేషన్తో గ్యాస్ట్రోనమీలో గేమ్ ఛేంజర్ ‘50 నెక్స్ట్ క్లాస్ ఆఫ్ 2022’ లిస్ట్లో ఒకరిగా నిలిచింది. రిష ఒక ఫుడ్ సైన్స్ ఇన్నొవేటర్.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పుట్టి పెరిగింది రిష. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన వాళ్ల అమ్మ రిషను డాక్టర్గా చూడాలనుకుంది. దాంతో మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది. కానీ సక్సెస్ కాలేదు . దాంతో డిగ్రీలో కెమిస్ట్రీ ఆనర్స్ చేసింది. ఆ టైంలోనే అమెరికన్ డాక్యుమెంటరీ టీవీ ప్రోగ్రాం ‘ఫోరెన్సిక్ ఫైల్స్’ తెగ చూసేది. ఆ ప్రోగ్రాం ప్రభావంతో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ కావాలనుకుంది. కానీ ఫుడ్ వేస్టేజీ గురించి, ఆరోగ్యాన్ని దెబ్బతీసే హెవీ మెటల్స్ గురించి చదివాక... ఈ సమస్యకు సొల్యూషన్ చూపించాలనుకుంది రిష.
ఆలోచన వచ్చిందిలా
ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్లో మాస్టర్స్ చదివింది రిష. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్లో అసిస్టెంట్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్గా చేరింది. అక్కడ పనిచేస్తున్న టైంలో ‘బయోసార్ప్షన్’ టెక్నిక్ గురించి విన్నది. నీళ్లలోని ఆర్సెనిక్, కాడ్మియం, కాపర్, మెర్క్యురీ, లెడ్, నికెల్, క్రోమియం వంటి హెవీ మెటల్స్ని తొలగించేందుకు సైంటిస్ట్లు అరటిపండు తొక్కలు, అగ్రికల్చర్ వేస్ట్ వాడుతున్నారని తెలుసుకుంది. అప్పుడే పండ్లు, కూరగాయ తొక్కల్ని ‘గ్రీన్ ఫిల్టర్స్’గా వాడొచ్చనే ఆలోచన వచ్చింది రిషకు. ఆ ఆలోచనే ఆమెని తక్కువ ఖర్చుతో నీళ్లలోని హెవీ మెటల్స్ని తొలగించే ఇన్నొవేషన్ వైపు నడిపించింది.
ఎలా క్లీన్ చేస్తాయంటే..
రీసెర్చ్లో భాగంగా... యాపిల్, అరటిపండు, ఆరెంజ్, కీర దోస, కివి పండ్ల తొక్కల్ని, ఆలుగడ్డ పొట్టుని సేకరించి వాటిని ఎండబెట్టి మెత్తగా పొడి చేసింది రిష. ఆ పొడికి సోడియం, కాల్షియం ఆక్జాలేట్ వంటి కెమికల్స్ కలిపి పూసల్లాగ చిన్న ముద్దలు (గ్రీన్ ఫిల్టర్స్) చేసింది. ఈ గ్రీన్ ఫిల్టర్స్ని హెవీ మెటల్స్ ఉన్న నీళ్లలో వేయాలి. వీటిలోని కార్బాక్సిల్, హైడ్రాక్సిల్ అనే నెగెటివ్ అయాన్స్ హెవీ మెటల్స్లోని పాజిటివ్ అయాన్స్తో కలుస్తాయి. దాంతో హెవీ మెటల్స్ తగ్గిపోయి, నీళ్లు శుభ్రమవుతాయి. పైగా ఇందుకు ఖర్చు కూడా తక్కువే.
ఆరు రీసెర్చ్ పేపర్స్
‘పండ్లు, కూరగాయల తొక్కల్ని చిన్న పూసల్లాగ చేసి మంచి నీళ్లలోని హెవీమెటల్స్ని తొలగించడం’ అనే అంశం మీద పీహెచ్డి చేసింది రిష. మూడున్నర ఏండ్లలో ఆరు రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేసింది. తక్కువ ఖర్చుతోనే నీళ్లలోని హెవీ మెటల్స్ని తొలగించే ఎక్స్పరిమెంట్బాగుందంటూ మెచ్చుకున్నారు సైంటిస్ట్లు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఫుడ్, డ్రింక్స్ వేస్టేజ్ తగ్గించడానికి సస్టైనబుల్ సొల్యూషన్ చూపిస్తున్న యాభై మంది ఉత్తమ సైంటిస్టుల్లో ఒకరిగా నిలిచింది రిష. ప్రస్తుతం లండన్లోని యాంగ్లియా రస్కిన్ యూనివర్సిటీలో ఫోరెన్సిక్ కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తోంది.
‘‘మనదేశంలో ప్రతిరోజు 40 శాతానికి పైగా ఫుడ్ వేస్టేజ్ జమ అవుతోంది. ఇందులో పండ్లు, కూరగాయ తొక్కలు 12 నుంచి 21 మిలియన్ టన్నుల వరకు ఉంటాయని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ చెప్పింది. దాంతో ఫుడ్ వేస్టేజ్, హెవీ మెటల్స్ వల్ల జరిగే నీటి కాలుష్యానికి సొల్యూషన్ చూపించాలనుకున్నా. అందుకని టాక్సికాలజీలో పీహెచ్డి చేశాను. పండ్ల తొక్కలతో చేసిన ‘గ్రీన్ ఫిల్టర్స్’ తో హెవీ మెటల్స్ని తొలగించి అందరికీ స్వచ్ఛమైన నీళ్లు అందించాలన్నదే నా లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లోని వాళ్లకు ఈ ‘గ్రీన్ ఫిల్టర్స్’ బాగా ఉపయోగపడతాయి” అంటోంది రిష.