
ఖమ్మం, వెలుగు: జేసీ మాల్ ఖమ్మంలో షాపింగ్ మాల్ ఓపెన్ చేసింది. ఇక్కడ క్లాత్స్, సిల్వర్ జ్యుయెలరీ అమ్ముతారు. సినీ నటి రీతు వర్మ ఈ మాల్ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యమైన, నమ్మకమైన బట్టలు, వెండి ఆభరణాలు అతి తక్కువ ధరకే జేసీ మాల్లో దొరుకుతాయని చెప్పారు. రీతు వర్మను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. షాపింగ్ మాల్ పరిసర ప్రాంతాలు జనాలతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో జేసీ మాల్ నిర్వహకులు కృష్ణారావు, వెంకటరెడ్డి, మర్రి జమున రెడ్డి, మర్రి మధుమతి రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.