
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ ఆర్జేడీ సత్యనారాయణ గురువారం ప్రభుత్వ బాలికల హైస్కూల్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫామ్, ఉపాధ్యాయుల యూనిట్ ప్లాన్, ఇయర్ ప్లాన్లను పరిశీలించారు. అనంతరం బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం పాఠశాలను సందర్శించి, ఆహ్లాదకరంగా ఉందని విద్యార్థులు ఇటువంటి పాఠశాలలో చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తారని హెచ్ఎం, టీచర్లను అభినందించారు.
అనంతరంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో మధ్యాహ్న భోజనంలో సిద్ధం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు వడ్డిస్తున్న వెజిటబుల్ బిర్యానీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని పరిశీలించి మధ్యాహ్న భోజన సిబ్బందిని అభినందించారు. ఆయన వెంట డీఈవో రవీందర్ రెడ్డి తదితరులున్నారు.