స్టూడెంట్స్​ ఇష్టంగా ఎగ్జామ్స్​కు సిద్ధం కావాలి : ఆర్ జేడీ సత్యనారాయణరెడ్డి

స్టూడెంట్స్​ ఇష్టంగా ఎగ్జామ్స్​కు సిద్ధం కావాలి : ఆర్ జేడీ సత్యనారాయణరెడ్డి

కామేపల్లి, వెలుగు : టెన్త్​ స్టూడెంట్స్​ఎగ్జామ్స్​కు ఇష్టంగా సిద్ధం కావాలని వరంగల్ ఆర్ జేడీ సత్యనారాయణరెడ్డి సూచించారు. గురువారం మండలంలోని కొమ్మినేపల్లి హైస్కూల్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఎగ్జామ్స్​కు ఎలా ప్రిపేర్ అవుతున్నారో టెన్త్​ స్టూడెంట్స్​ను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

మధ్యాహ్నం భోజనంపై ఆరా తీశారు. ఆయన వెంట  స్కూల్​హెచ్ఎం పీ.జ్యోతి, టీచర్లు  రచ్చ శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, రవి, రమాప్రభ, ఉష రాణి, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, జ్యోతి, విజయ కుమారి, నాగేశ్వరరావు ఉన్నారు.