చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లో ఘోర ప్రమాదం..మహిళలు, పిల్లలతోసహా 13 మంది దుర్మరణం

చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లో ఘోర ప్రమాదం..మహిళలు, పిల్లలతోసహా 13 మంది దుర్మరణం
  • మరో 11 మందికి తీవ్రగాయాలు

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లోని రాయ్​పూర్​లో  ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. రాయ్‌‌‌‌‌‌‌‌పూర్-బలోదాబజార్ హైవేపై సరగావ్ గ్రామం వద్ద ట్రైయిలర్​ట్రక్కు, మినీ ట్రక్కు(స్వరాజ్ మజ్దా గూడ్స్) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. విధాన్​సభా ఏరియాలోని చతౌడీ గ్రామానికి చెందిన దాదాపు 50 మంది మినీ ట్రక్కులో  బనారసీ గ్రామంలో జరిగిన ఓ వేడుకకు వెళ్లారు. వేడుక ముగిశాక తిరిగి తమ గ్రామానికి వెళ్తున్న క్రమంలో వీరి వెహికల్..భారీ యంత్రాలతో వెళ్తున్న ట్రైయిలర్​ట్రక్కును బలంగా  ఢీకొట్టిందని అధికారులు వెల్లడించారు. 

13 మంది అక్కడికక్కడే మృతి చెందారని..మృతుల్లో 9 మంది మహిళలు, నలుగురు చిన్న పిల్లలు ఉన్నట్లు వివరించారు.  మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.  గాయపడిన వారిని రాయ్​పూర్​లోని అంబేద్కర్​  ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. యాక్సిడెంట్ అనంతరం ట్రైయిలర్ ట్రక్కు డ్రైవర్​అమిత్​కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.