- ఘోర రోడ్డు ప్రమాదం,ఐదుగురు మృతి
- లారీని ఢీకొన్న ఫార్చ్యూన్ వాహనం
- మృతుల్లో ఇద్దరు చిన్నారులు
- మరో ఇద్దరి పరిస్థితి విషమం
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ఫార్చ్యూన్ వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. తిరుపతి నుండి దైవ దర్శనం చేసుకొని పాలకొల్లు వెళ్తున్న ఫార్చ్యూన్ వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో అందులో ఉన్నవారిలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో ఇద్దరు పిల్లలు, ముగ్గురు పెద్ద వాళ్లు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగినపుడు వాహనంలో మొత్తం 11 మంది ఉన్నారు.
గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాహనంలో డ్రైవరు ఇరుక్కుపోవడంతో జెసిబి సాయంతో బయటకు తీసి రక్షించారు. వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం సబ్బు వారి పాలెం గ్రామానికి చెందిన వారు. ఇరు కుటుంబాల వారు తిరుపతి దైవ దర్శనం నిమిత్తం వెళ్లి వస్తుండగా ఈ ఘోర సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే నరసరావుపేట డి.ఎస్.పి రామ వర్మ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చనిపోయిన వారిలో సూర్య భవాని(22), వెంకట్ (30), గీతేశ్వరి బాబు(4), సోనాక్షి(5), మనోజ్(22) వారిలో ఉన్నారు.