ఐదేళ్ల బాలుడిని ఢీకొన్న బైక్. బాలుడు మృతి

ఐదేళ్ల బాలుడిని ఢీకొన్న బైక్. బాలుడు మృతి

మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ పి.యస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న హరికష్ణ అనే 5 ఏళ్ల బాలుడిని ఓ బైక్ ఢికొట్టడంది. దీంతో తీవ్ర గాయాల పాలైన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

బాలుడి కుటుంబం 15 రోజుల క్రితమే  బ్రతుకుదెరువు కోసం కర్నూల్ జిల్లా నుండి జవహార్ నగర్ వలస వచ్చింది.  కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న తమ కుటుంబంలో ఈ ప్రమాదం తీవ్ర విషాదం నింపిందని రోదిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలుడి తల్లిదండ్రులతో పాటు, స్థానికులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. బైక్ నడిపిన వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడు.