తిరుమల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం.. మహిళా స్పాట్ డెడ్

తిరుమల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం.. మహిళా స్పాట్ డెడ్

తిరుమల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. శ్రీవారిని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా మొదటి ఘాట్ (డౌన్  ఘాట్) రోడ్డులోని 24వ మలుపు వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సు ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న అరీఫా (32) అనే మహిళ అక్కడికక్కడే మరణించింది. బైక్ నడుపుతున్న సురేష్ అనే వ్యక్తితో పాటు అరీఫా కొడుకు షామీర్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. 

ALSO READ |తిరుమలలో కారులో ఒక్కసారిగా మంటలు... పరుగులు తీసిన భక్తులు..

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అరీఫా మృతదేహాన్ని పోస్ట్‎మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వెళ్తుండగా అరీఫా మృతి చెందడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.