ఓవర్ లోడ్.. అతివేగం.. రాంగ్ రూట్ డ్రైవింగ్. .. నిబంధనలు పాటించకపోవడం.. గుంతల రోడ్లు, ప్రమాదకక మలుపులు.. వెరసి ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. మొన్నటికి మొన్న కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదం ఆనవాళ్లు చెరిగిపోకముందే.. హైదరాబాద్.. తాండూర్ రోడ్డులో మరో ఘోర ప్రమాదం జరిగింది.
దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత పది రోజుల్లో జరిగిన వేర్వేరు ఘోర ప్రమాదాల్లో దాదాపు 60మంది దుర్మరణం పాలయ్యారు. ఇవాళ( నవంబర్ 3) రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించారు. ఇంతకుముందు కర్నూలులో 20, రాజస్థాన్ లో 18, బాపట్లలోని సత్యవతిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో 2 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలు ప్రయాణ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదం కంకర ఓవర్ లోడ్ టిప్పర్.. బస్సు ప్రయాణికుల ప్రాణాలను తీసింది. రాంగ్రూట్ లో ఎదురగా.. అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో బస్ దాదాపుగా 50 అడుగులు వెనక్కు వెళ్లింది. బస్సులో ప్రయాణికులపై కంకర రాళ్లు పడటంతో ఎక్కడి వారు అక్కడే 19 మంది మృతి చెందారు. 14 మంది గాయపడ్డారు. మృతుల్లో వీకెండ్ హాలిడేస్ ముగించుకొని ఉద్యోగాలకు వెళ్లేవారు.. విద్యార్థులు ఎ క్కువుగా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సిస్టర్స్ ప్రాణాలు విడిచారు.
ఇప్పటి వరకు ( నవంబర్ 11.30 గంటలకు) గుర్తించిన మృతుల వివరాలు
- దస్తగిరి బాబా-బస్సు డ్రైవర్
- తారిబాయ్ (45)- దన్నారమ్ తండా
- కల్పన (45)- బోరబండ
- బచ్చన్ నాగమణి (55)- భానూరు
- ఏమావత్ తాలీబామ్- దన్నారమ్ తండా
- మల్లగండ్ల హనుమంతు- దౌల్తాబాద్
- గుర్రాల అభిత (21)- యాలాల్
- గోగుల గుణమ్మ- బోరబండ
- షేక్ ఖలీద్ హుస్సేన్- తాండూరు
- తబస్సుమ్ జహాన్- తాండూరు
- ముగ్గురు అక్కాచెల్లెళ్లు ( నందిని, తనూష, సాయి ప్రియ)
క్షతగాత్రులు..
- వెంకటయ్య
- బుచ్చిబాబు-దన్నారమ్ తండా
- అబ్దుల్ రజాక్-హైదరాబాద్
- వెన్నెల
- సుజాత
- అశోక్
- రవి
- శ్రీను- తాండూరు
- నందిని- తాండూరు
- బస్వరాజ్-కోకట్ (కర్ణాటక)
- ప్రేరణ- వికారాబాద్
- సాయి
- అక్రమ్-తాండూరు
- అస్లామ్-తాండూరు
కంకర టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్.. అదుపు తప్పి బస్సుపై బోర్లా పడిందని పోలీసులు చెబుతున్నారు. కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో ఈ తీవ్రత ఎక్కువైందని అంటున్నారు.
