
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్రవల్లి చౌరస్తాలోని పెట్రోల్ పంపు దగ్గర నేషనల్ హైవేపై ముందు వెళ్తున్న లారీని స్కార్పియో ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి స్కార్పియో వాహనంలో ఏడుగురు హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.