ఎమ్మార్పీఎస్ వర్గీకరణలో బీజేపీ చేసిన మోసానికి నిరసనగా మార్చి15న రెండు తెలుగు రాష్ట్రాల జాతీయ రహదారులను దిగ్భందం చేస్తామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ పిలుపునిచ్చారు. ఎస్సీల వర్గీకరణలో నెంబర్ వన్ దోషి బీజేపీనేనని ఆరోపించారు. వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి, మోసం చేసింది కూడా బీజేపీనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చేపట్టిన ప్రజా భరోసా యాత్ర ఎస్సీలకు ఏ మాత్రం భరోసా ఇవ్వలేదని, ఇక తెలంగాణ ప్రజలకు ఏం భరోసా ఇస్తారంటూ మందకృష్ణ ఎద్దేవా చేశారు. మార్చి 15న ఎస్సీల వర్గీకరణ కోసం హైదరాబాద్, విజయవాడ రెండు రహదారులపై నిరసనలు చేపడతామని చెప్పారు. ఈ నెల 22 నుండి మార్చి14 వరకు అన్ని మండలాల నుండి రాష్ట్ర రాజధాని వరకు పాదయాత్ర చేస్తామని స్పష్టం చేశారు. అనాథ పిల్లలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మంత్రుల నియోజకవర్గాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేస్తామని మందకృష్ణ తెలిపారు. బడ్జెట్ లో రూ.3 లక్షల కోట్లు కేటాయించారని చెప్తున్నారు గానీ.. రూ.3కూడా కేటాయించలేదని ఆరోపించారు.
మార్చి15న రోడ్లు దిగ్భందం చేస్తం : మందకృష్ణ
- తెలంగాణం
- February 19, 2023
లేటెస్ట్
- PBKS vs CSK: దూబే గోల్డెన్ డక్.. చెన్నైకి షాక్ల మీద షాక్లు
- ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా: గడ్డం వంశీకృష్ణ
- Health News: సమ్మర్ సీజన్.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతి...
- పోస్టల్ బ్యాలెట్లకు మరో అవకాశం... ముఖేష్ కుమార్ మీనా
- తెలంగాణ మర్లపడ్డది.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారం మాదే: కేసీఆర్
- కోవిషీల్డ్ వాక్సిన్ తీసుకున్న వాళ్లకు హార్ట్ఎటాక్ వస్తుందా?
- T20 World Cup 2024: సరైన ప్రాక్టీస్ లేదు.. మేం ప్రపంచ కప్ గెలిచేది కష్టమే: బంగ్లా ఆల్రౌండర్
- World Laughing Day 2024: నవ్వుతూ బతకేయాలిరా తమ్ముడూ.. అంతర్జాతీయ లాఫింగ్ డే
- Heeramandi OTT: విమర్శలు, ప్రశంసలతో ఓటీటీలో దూసుకుపోతున్న..సంజయ్ లీలా భన్సాలీ హీరామండి వెబ్ సిరీస్
- మోదీ కులపెద్దకు ఎక్కువ..మతగురువుకు తక్కువ: భవానీ రెడ్డి
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు