మున్సి పల్ ఎన్నికలకు భారీ బందోబస్తు : ఎస్పీ బి.రోహిత్రాజు

మున్సి పల్ ఎన్నికలకు భారీ బందోబస్తు : ఎస్పీ బి.రోహిత్రాజు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ బి.రోహిత్​రాజు తెలిపారు. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్​లో పోలీస్​అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​తోపాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నట్లు పేర్కొన్నారు.

288 పోలింగ్ కేంద్రాల్లో 125 సెన్సిటీవ్​, 15 క్రిటికల్​ కేంద్రాలను గుర్తించామన్నారు. ఎనిమిది ఫ్లయింగ్​స్క్వాడ్, నాలుగు స్టాటిక్​సర్వేలయన్స్ బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లకు ప్రలోభాలకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు ఆదినారాయణ, సతీశ్ కుమార్, వెంకన్న బాబు పాల్గొన్నారు.