రోష్​ నుంచి వాబైస్మో ఇంజెక్షన్​ .. కంటి వ్యాధుల బాధితుల కోసం 

రోష్​ నుంచి వాబైస్మో ఇంజెక్షన్​ .. కంటి వ్యాధుల బాధితుల కోసం 

హైదరాబాద్​, వెలుగు: కొన్ని రకాల కంటి వ్యాధుల చికిత్స కోసం రోష్​ ఫార్మా ఇండియా వాబైస్మో (ఫారిసిమాబ్) ఇంజెక్షన్​ను లాంచ్​ చేసింది. నియోవాస్కులర్ లేదా 'వెట్' ఏజ్-రిలేటెడ్ మాక్యులర్ డిజెనరేషన్ (ఎన్​ఎంఏడీ)  డయాబెటిక్ మాక్యులర్ ఎడెమా (డీఎంఈ) అనే కంటి వ్యాధుల చికిత్స కోసం ఈ ఇంజెక్షన్​వాడుతారు.  దీనిని ఇండియాలోనే తయారు చేశామని కంపెనీ తెలిపింది.

వాబైస్మో (ఫారిసిమాబ్)ను జనవరి 2022లో యూఎస్ఎఫ్​డీఏ ఆమోదించింది. ఇది ఇప్పుడు 90కిపైగా దేశాలలో అందుబాటులో ఉంది.  ఇప్పటి వరకు 2 మిలియన్ల కంటే ఎక్కువ డోసులు ఇచ్చామని రోష్ ​తెలిపింది. కంపెనీ ధర వివరాలను వెల్లడించనప్పటికీ,  మొదటి సంవత్సరం చికిత్స కో సుమారు రూ.నాలుగు లక్షల వరకు, తదుపరి సంవత్సరాలకు రూ.రెండు లక్షలు ఖర్చవుతుందని అంచనా.