
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వెస్టిండీస్ టూర్కు దూరంగా ఉండే చాన్స్ ఉంది. ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న అతనికి విండీస్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు బ్రేక్ ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఈ నెల 27న టీమ్ను ఎంపిక చేయనున్న నేపథ్యంలో రెస్ట్ విషయంపై హిట్మ్యాన్తో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. ఐపీఎల్తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ రోహిత్ అనుకున్న స్థాయిలో ఆడలేకపోయాడు. దీంతో అతను తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే విండీస్తో టెస్టులకు రెస్ట్ ఇచ్చి ఫ్రెష్గా వైట్బాల్ సిరీస్ల్లో బరిలోకి దించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఒకవేళ రోహిత్కు రెస్ట్ ఇస్తే అజింక్యా రహానెను తాత్కాలిక కెప్టెన్గా నియమించనున్నారు.
రోహిత్తో పాటు కోహ్లీకి కూడా విశ్రాంతి ఇస్తే చతేశ్వర్ పుజారాను టీమ్లో కంటిన్యూ చేయనున్నారు. 2022లో రోహిత్ టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇండియా 10 మ్యాచ్లు ఆడింది. ఇందులో రోహిత్ మూడింటికి దూరంగా ఉన్నాడు. కొవిడ్ కారణంగా ఇంగ్లండ్తో ఒకటి, బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల్లో అతను బరిలోకి దిగలేదు. ఆడిన ఏడు టెస్ట్ల్లో రోహిత్ 35.45 యావరేజ్తో 390 రన్స్ మాత్రమే చేశాడు.