సెంచరీ చేసి నువ్వే మాకు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలి: రోహిత్ శర్మ

సెంచరీ చేసి నువ్వే మాకు  బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలి: రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ  తోటి ఆటగాళ్లతో ఎంతో  ఫన్నీగా ఉంటాడు. అప్పుడప్పుడు గ్రౌండ్ లో ఆటగాళ్లతో చేసే  ఇంటర్వ్యూలు నవ్వులు తెప్పిస్తాయి. ఇతర ఆటగాళ్లను  అతడు అడిగే క్వశ్చన్లు, వారిపై జోక్స్  వేసి అందరినీ ఆకట్టుకుంటాడు.  ఈ రోజు  టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్   బర్త్ డే. అయితే  ఇషాన్ కిషన్ కు బర్త్ డే గిఫ్ట్   ఇవ్వాల్సింది పోయి.. రోహిత్ శర్మనే ఇషాన్ ను  బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలని అడిగాడు.  ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.

జూలై 19న ఇషాన్ కిషన్ తన 25వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.  ఇషాన్ కిషన్  బర్త్ డే సందర్భంగా అతనికి ఏం గిఫ్ట్ ఇస్తారని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు రోహిత్  రియాక్షన్ వైరల్ గా మారింది. ఈ క్వశ్చన్ ఇషాన్ నే అడుగుదామనుకున్నా.. అయినా ఇషాన్ దగ్గర అన్నీ ఉన్నాయ్. అతనే మాకు గిఫ్ట్ ఇవ్వాలి..రెండో టెస్టులో సెంచరీ చేసి టీమిండియాకు గిఫ్ట్ ఇవ్వాలంటూ  అడిగాడు. దీంతో అక్కడున్న వారంతా నవ్వేశారు.

 వెస్టిండీస్ టూర్ తో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ తొలిటెస్టులో  కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇషాన్ కిషన్ ఒక పరుగు చేయగానే   రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డక్లేర్ చేశాడు. ఈ మ్యాచ్ లో  ఇన్నింగ్స్141 పరుగుల తేడాతో భారత్ గెలిచిన సంగతి తెిసిందే..