వీడియో: పాక్ బౌలర్లపై రోహిత్ శర్మ కౌంటర్లు.. రితికా సజ్దే నవ్వులే నవ్వులు

వీడియో: పాక్ బౌలర్లపై రోహిత్ శర్మ కౌంటర్లు.. రితికా సజ్దే నవ్వులే నవ్వులు

ఇప్పటిదాకా రోహిత్ శర్మ అంటే.. ధోని తరువాత తనే అనుకునే వాళ్లం. చాలా ప్రశాంతంగా ఉంటాడని, ఎవరిపై విమర్శలు.. కౌంటర్లు వేయరని చెప్పుకునే వాళ్లం. కానీ రోహిత్ అనుకున్నంత అమాయకుడేం కాదు. నాణెంపై బొమ్ము, బొరుసు ఉన్నట్లే.. హిట్ మ్యాన్‌లో కూడా రెండు కోణాలు దాగున్నాయి. 

విండీస్‌తో టీ20 సిరీస్ కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, భార్య రితికా సజ్దేతో కలిసి అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అతను యూఎస్‌ఏలో జరిగిన ఒక ఈవెంట్‌లో పాల్గొనగా అక్కడ పాకిస్తాన్ బౌలర్ల గురుంచి ఒక ప్రశ్న ఎదురైంది. అత్యంత కఠినమైన పాక్ బౌలర్ ఎవరు అని ఓ అభిమాని అడగ్గా.. హిట్ మ్యాన్ పాక్ బౌలర్ల తలపొగరుకు తగ్గట్టే మంచి సమాధానమిచ్చారు. అది విన్న రితికా సజ్దే ముసిముసి నవ్వులు చిందించింది.

"పాకిస్థాన్ టీమ్ మే సబ్ అచే హై. మై కిసీ కా నామ్ నహీ లూంగా. బడా బడా కాంట్రవర్సీ హోతా హై (పాకిస్తాన్ జట్టులోని పేసర్లందరూ సమానమే. నేను ఏ ఒక్కరినీ ఎంపిక చేయను. అలా చేశాననుకో ఇందులో కూడా తప్పులు వెతుకుతారు."

"ఏక్ కా నామ్ లేతే హై తో దూస్రే కో అచా నహీ లగ్తా. దూస్రే కా లేతే హై తో తీస్రే కో అచా నహీ లగ్తా. సారే హాయ్ అచే హై (నేను ఒక ఆటగాడి పేరు చెప్పాననుకో.. రెండవ ఆటగాడు చెడుగా భావిస్తారు. అదే రెండవ ఆటగాడిని పేరు తీసుకుంటే.. మూడవ వ్యక్తికి చెడుగా అనిపిస్తుంది. అందుకే అందరూ గొప్పోల్లే.." అని రోహిత్ చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా వెనుకంజలో ఉంది. వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓడిన హార్దిక్ సేన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2 తేడాతో వెనుకబడి ఉంది.