కోహ్లీ, బుమ్రా కాదు అతడే వరల్డ్ కప్ లో మాకు మెయిన్ ప్లేయర్: రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

కోహ్లీ, బుమ్రా కాదు అతడే వరల్డ్ కప్ లో మాకు మెయిన్ ప్లేయర్: రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

వరల్డ్ కప్ కి 15 మందితో కూడిన భారత జట్టుని నిన్న ప్రకటించేశారు. ఆసియా కప్ కి సెలక్ట్ చేసిన 17 మందిలో తిలక్ వర్మ, ప్రసిద్ క్రిష్ణని తొలగించి మిగిలిన ప్లేయర్లను వరల్డ్ ఎంపిక చేశారు. ఇందులో భాగంగా నిన్న సెలక్టర్ అజిత్ అగార్కర్ తో పాటుగా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ మీట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఈ వరల్డ్ కప్ లో మాకు హార్దిక్ పాండ్య మాకు మెయిన్ ప్లేయర్ అని చెప్పేసాడు.

హార్దిక్ ఫామ్ లో ఉండడం మాకు చాలా ముఖ్యం

జట్టులో ఒక ఆల్ రౌండర్ ఉంటే జట్టు సమతుల్యంగా ఉండడంతో పాటు కెప్టెన్ కి ఎంతో భరోసానిస్తుంది. బ్యాటింగ్ లో కీలక పరుగులు చేయడంతో పాటు బౌలింగ్ లో బౌలర్ల భారాన్ని పంచుకుంటాడు. ప్రస్తుతం భారత జట్టులో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఆ పనిని సమర్ధవంతంగా పోషిస్తున్నాడు. ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ మీద జరిగిన లీగ్ మ్యాచ్ లో 87 పరుగులు చేసి జట్టు టాప్ స్కోరర గా నిలిచాడు. 60 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన దశలో హార్దిక్ ఆడిన ఇన్నింగ్స్ మరువలేనిది.
 
హార్దిక్ ఇన్నింగ్స్ కెప్టెన్ రోహిత్ శర్మని బాగా  ఇంప్రెస్స్ చేసింది. ఈ ఆల్ రౌండర్ పై ప్రశంసలు కురిపిస్తూ "‘వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో  ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఫామ్ మాకు చాలా కీలకం. జట్టులో బౌలింగ్, బ్యాటింగ్ చేసే ప్లేయర్లు ఉండడం జట్టుకి బాగా కలిసి వస్తుంది. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో వీరు  ప్రధాన పాత్ర పోషిస్తారు. గతేడాది కూడా పాండ్యా చాలా అద్భుతంగా ఆడాడు. అతని ఆట చాలా మెరుగవ్వడంతో పాటు కీలక దశలో పాక్ పై ఎంతో పరిణితి చెందిన ఆట ఆడడటం అతనెంత గొప్ప ఆటగాడో తెలియజేస్తుంది" అనిరోహిత్ తెలియజేశాడు.