టీంఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ హెల్త్ గురించి అతని చిన్న కూతురు సమైరా శర్మ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్తో జరిగే ఐదవ టెస్టుకు ముందు రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ప్రస్తుతం రోహిత్ ఐసోలేషన్ లో ఉన్నాడు. ఈ క్రమంలో అతని చిన్న కుమార్తె సమైరా తన తండ్రి గురించి హెల్త్ అప్డేట్ ఇచ్చింది. రోహిత్ ఏం చేస్తున్నాడంటూ సమైరాను యూకేలో విలేకరులు ప్రశ్నించగా.. ఆ చిన్నారి " డాడీ రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఓన్లీ గార్డియన్ కి రానిస్తున్నారు" అంటూ క్యూట్ గా చెప్పుకొచ్చింది. ఈ వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ గా మారింది. కాగా జులై 1 నుండి ఎడ్జ్బాస్టన్ టెస్ట్ మొదలుకానుంది. రోహిత్ శర్మకు ప్లేస్ లో బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది.
#RohitSharma Daughter #samaira Today at #Leicester How cute she is ?? MY FATHER IS TAKING REST IN THE ROOM GOT #covidpositive @ritssajdeh @ImRo45 #ENGvIND @ITGDsports pic.twitter.com/Tbpu0HSUIQ
— Krishna sai ✊?? (@Krishna19348905) June 27, 2022