- టార్గెట్ను మించి రుణాల మంజూరు
- రాష్ట్రంలో టాప్10లో మూడు జిల్లాలు మనవే
- వ్యాపారాలతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న మహిళలు
మహబూబాబాద్, వెలుగు: బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని.. ఆ డబ్బుతో వ్యాపారాలు చేస్తూ.. సకాలంలో రుణాలను చెల్లిస్తూ ఉమ్మడి జిల్లాలోని పొదుపు సంఘాల మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు మహిళా సంఘాలకు 1,609.09 కోట్ల రుణాలను ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకోగా 1,727.83 కోట్లు ఇచ్చాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాలు ప్రతి సంవత్సరం వంద శాతం టార్గెట్ రీచ్ కావాలని ప్రయత్నిస్తున్నా సక్సెస్ కాలేకపోతున్నాయి. కానీ ఉమ్మడి వరంగల్లోని అన్ని జిల్లాల్లో వంద శాతానికి మించి లోన్లు పంపిణీ చేశారు. అంతేకాకుండా రుణాల పంపిణీలో రాష్ట్రంలోని టాప్టెన్ జిల్లాల్లో మూడు ఉమ్మడి వరంగల్లోనివే కావడం గమనార్హం. డ్వాక్రా సంఘాలకు బ్యాంక్ రుణాల పంపిణీలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో సంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలువగా, మూడో స్థానంలో వరంగల్, ఆరో స్థానంలో జనగామ, 10వ స్థానంలో మహబూబాబాద్, 17వ స్థానంలో ములుగు, 26వ స్థానంలో జయశంకర్ భూపాలపల్లి, 27వ స్థానంలో హనుమకొండ జిల్లాలు నిలిచాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్రావు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఆఫీసర్లు బ్యాంకు రుణాల పంపిణీ టార్గెట్రీచ్అయ్యేలా కృషి చేశారు.
ఆర్థికంగా ఎదుగుతున్న మహిళలు
పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల ద్వారా పొందిన రుణాలతో వివిధ వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారు. వ్యవసాయ కుటుంబాలకు చెందిన మహిళలు లోన్డబ్బులను కూరగాయలు, ఇతర పంటల సాగుకు వినియోగిస్తుండగా ఇతర మహిళలు ఆ డబ్బులతో కిరాణాషాప్ పెట్టుకుంటున్నారు. పలువురు గేదెల పెంపకం చేపట్టి పాల బిజినెస్చేస్తున్నారు. ఇక కుట్టుమెషిన్లు, రెడీమేడ్దుస్తుల విక్రయాలు, ఇతర కుటీర పరిశ్రమలు సైతం నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా లోన్తిరిగి చెల్లిస్తుండడంతో బ్యాంకర్లు సైతం క్రమంగా వారికి ఇచ్చే లోన్మొత్తాన్ని పెంచుతూ పోతున్నారు.
లోన్ రికవరీ బాగుంది
2021–-22 ఆర్థిక సంవత్సరంలో మహబూబాబాద్ జిల్లాలో 12,160 స్వయం సహాయక సంఘాలకు రూ. 343.24 కోట్లు బ్యాంక్ లింకేజ్ లక్ష్యం కాగా, 8,273 సంఘాలకు రూ.364.79 కోట్లు మంజూరు చేశాం. మహిళలు వారు పొందిన రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.412 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం.
- సన్యాసయ్య, డీఆర్డీఏ పీడీ, మహబూబాబాద్