
హైదరాబాద్, వెలుగు: ఇండియాలోనే కాంప్లెక్స్ డిఫెన్స్ ఏరో–ఇంజన్ల తయారీకి ఆజాద్ ఇంజనీరింగ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రోల్స్ రాయిస్ సోమవారం తెలిపింది. దీర్ఘకాలిక ఒప్పందం ప్రకారం, హైదరాబాద్కు చెందిన ఆజాద్ ఇంజనీరింగ్ డిఫెన్స్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ల కోసం కాంప్లెక్స్ కాంపోనెంట్లను సరఫరా చేస్తుంది.
తమకు కాంప్లెక్స్ కాంపోనెంట్లను సప్లయ్ చేస్తున్న గ్లోబల్ కంపెనీల జాబితాలో ఆజాద్ ఇంజనీరింగ్ చేరుతుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అండ్ గ్లోబల్ నెట్వర్క్స్ హెడ్ అలెక్స్ జినో అన్నారు. ఆజాద్ ఇంజినీరింగ్ ఫౌండర్ రాకేశ్ చోప్దార్ మాట్లాడుతూ, ఈ కీలకమైన భాగాలను భారతదేశంలోనే తయారు చేయడం వల్ల మన ఏరోస్పేస్ రక్షణ పరిశ్రమకు మేలు కలుగుతుందని అన్నారు.