
విలేజ్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా ‘రోలుగుంట సూరి’. నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలిపి హీరోహీరోయిన్లుగా అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో సౌమ్య చాందిని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను నటుడు రాజేంద్రప్రసాద్ లాంచ్ చేసి టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇదొక రియలిస్టిక్ విలేజ్ డ్రామా. భావోద్వేగాలు, జీవిత సత్యాలతో కూడిన ఈ కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.
ఇలాంటి సినిమాలు గ్రామీణ జీవన శైలిని నిజ జీవితానికి దగ్గరగా చూపిస్తాయి. ’ అని అన్నారు. బ్రహ్మనందరెడ్డి, సత్యనారాయణ, ఆయుషా, జ్యోతి, మహర్షి రమణ, ముకుందం శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నాడు.